Posts

Showing posts from March, 2020

భారతదేశం పురాతన నగరాలు | indian ancient cities

Image
                                                     భారతదేశం పురాతన నగరాలు  భారతదేశానికి  ఎంతో  ప్రాచీన చరిత్ర ఉంది .  అలాగే మన దేశం లో అనేక పురాతనమైన నగరాలున్నాయి. సింధు నాగరికత నుంచే ఎంతో అద్భుతమైన నగరాలు కలిగిన మన దేశం లో ప్రస్తుతం ఇప్పటి నగరీకరణను తట్టుకొని కొన్ని కొన్ని నిలబడగా మరి కొన్ని చారిత్రక ఆనవాళ్లు గా మాత్రమే కనబడుతున్నాయి. ఇందులో అటువంటి కొన్ని నగరాల గురించి తెలుసుకుందాం.     వారణాసి - దీనినే  బనారస్  అని కూడా పిలుస్తారు . హిందువుల విశ్వాసం ప్రకారం ఇది ఎంతో పవిత్రమైన నగరం .ఇక్కడ ఉండే విశ్వనాథ్ దేవాలయానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది . 2014-2015 లో జరిగిన త్రవ్వకాల్లో ఇక్కడ 1800 (బి .సి. ఇ )  ప్రాంతం లోని వస్తువులు బయటపడ్డాయి . ఇక్కడ జరిగిన దండయాత్రలో భాగంగా ఆలయాలు కొంత వరకు దెబ్బ తిన్నాయని చెప్పవచ్చు . ఇక్కడే పతంజలి మహర్షి యోగ భాష్యాలను చెప్పరాని ప్రశస్తి . కాశి విశ్వేశ్వరు...

భారతదేశం మరియు నాస్తిక భావజాలం | India and Atheism

Image
                                            భారతదేశం మరియు నాస్తిక భావజాలం  మన దేశంలో అనేక మతాలు ఉద్భవించిన  ఎన్నో సిద్ధాంతాలు పుట్టుకొచ్చిన   నాస్తిక  భావజాలం కూడా  ముందు నుంచి ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి.   నాస్తికత్వం అనగా దేవుడి పై  విశ్వాసాన్ని ఉంచకపోవడం.   శ్రమన పారంపర్యం, జైన, బౌద్ధ, చార్వాక, లోకయత, ఆజీవక  ఇలాగే చాలా మతాల్లో కొంత వరకు నాస్తిక త్వాన్ని బోధించారు. కొంత మంది ఋషులు కూడా కొంత మేర ఈ ప్రభావానికి లోనయ్యారు. వారిలో  జైమిని, పద్మాకర, జాబాలి  ఆధునికంలో  సావర్కర్  తో పాటుగా చాలా మంది ఉన్నారు.  హిందూ మతం దేవుని పట్ల విశ్వాసం, కర్మ, పునర్జన్మ లాంటి విషయాలలో విశ్వాసం ఉంచినా  అదే విధంగా నాస్తికత్వం ని కూడా అదే తనలో ఇమిడ్చుకోగలిగింది. వ్యాసుడు రాసిన ఉత్తర మీమాంస ఆస్తిక గ్రంథం కాగా  ఆయన శిష్యుడైన జైమిని మహర్షి రూపొందించిన పూర్వ మీమాంస మాత్రం నాస్తిక భావజాలం ఉ...

#VISHNUKUNDINULU #విష్ణుకుండినులు

Image
                                                         విష్ణుకుండినులు  శాతవాహనులు , ఇక్ష్వాకుల  తర్వాత మన తెలుగు ప్రాంతాలని రాజకీయంగా, సాంస్కృతిక  గొప్పగా పాలించిన వారిలో విష్ణుకుండినులు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారు . వీరు క్రీ శ  350-540 సంవత్సరాల మధ్య పరిపాలించినట్టుగా తెలుస్తుంది. ఈ రాజ్య స్థాపకుడు ఇంద్రవర్మ . ఈ రాజ్యం కృష్ణా ,గోదావరి నదుల మధ్యలో వెలసింది . అంటే ఇప్పటి తెలంగాణ లోని పాలమూరు , నల్లగొండ ,హైద్రాబాదు , మెదక్ ,కర్నూల్ ,గోదావరి ,కృష్ణా , నెల్లూరు ఈ ప్రాంతాలు ఈ రాజ్యం లో ఉన్నాయనేది చారిత్రక వాదుల అభిప్రాయం .                                    ఇంద్రవర్మ మొదటగా ఇంద్రపాల నగరం అనే రాజధానిగా ఏర్పాటు చేసి పాలించాడు .ప్రస్తుతం ఈ ఇంద్రపాల నగరం(తుమ్మల గూడెం ) అనే చారిత్రక నగరం నల్లగొండ జిల్లాలో ఉంది .ఇటీవలే వీరి శా...