#VISHNUKUNDINULU #విష్ణుకుండినులు
విష్ణుకుండినులు
శాతవాహనులు , ఇక్ష్వాకుల తర్వాత మన తెలుగు ప్రాంతాలని రాజకీయంగా, సాంస్కృతిక గొప్పగా పాలించిన వారిలో విష్ణుకుండినులు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారు . వీరు క్రీ శ 350-540 సంవత్సరాల మధ్య పరిపాలించినట్టుగా తెలుస్తుంది. ఈ రాజ్య స్థాపకుడు ఇంద్రవర్మ .
ఈ రాజ్యం కృష్ణా ,గోదావరి నదుల మధ్యలో వెలసింది . అంటే ఇప్పటి తెలంగాణ లోని పాలమూరు , నల్లగొండ ,హైద్రాబాదు , మెదక్ ,కర్నూల్ ,గోదావరి ,కృష్ణా , నెల్లూరు ఈ ప్రాంతాలు ఈ రాజ్యం లో ఉన్నాయనేది చారిత్రక వాదుల అభిప్రాయం .
ఇంద్రవర్మ మొదటగా ఇంద్రపాల నగరం అనే రాజధానిగా ఏర్పాటు చేసి పాలించాడు .ప్రస్తుతం ఈ ఇంద్రపాల నగరం(తుమ్మల గూడెం ) అనే చారిత్రక నగరం నల్లగొండ జిల్లాలో ఉంది .ఇటీవలే వీరి శాసనాలు హైదరాబాద్ నగరంలో త్రవ్వకాలలో భాగంగా బయటపడ్డాయి .
వీరి కాలంలో శైవం ,వైష్ణవం ,బౌద్ధం ,జైనం వంటి ప్రాంతాలు విలసిల్లాయి . ప్రధానంగా శ్రీశైలం ,ఉమామహేశ్వరం ,కొలనుపాక లాంటి స్థలాలు శైవానికి , శ్రీ పర్వతం , కొల్హాపూర్ వంటివి వైష్ణవానికి , కొలనుపాక , వేంగి,పఠాన్ చెరు,బెజవాడ ప్రాంతాలు జైనానికి ,
గుంటుపల్లి ,నాగార్జునసాగర్ (శ్రీ పర్వతం ) నల్లగొండ లోని చాలా ప్రాంతాలు బౌద్ధానికి ప్రసిధ్ధంగా ఉండేవని తెలుస్తుంది .
విష్ణుకుండినులు అన్ని మతాలని సమానంగా చూసారని తెలుస్తుంది .వీరు ప్రధానంగా శ్రీ పర్వత స్వామీ భక్తులు గా ఉన్నారు .అనేక యాగాలు , క్రతువులని అనుసరించి నట్టుగా తెలుస్తుంది .
ఈ రాజ్యాన్ని ఇంద్రవర్మ స్థాపించిన మాధవ వర్మ కాలం లోనే పెక్కు పేరు ని సంపాదించి గా తెలుస్తుంది .
2వ మాధవ వర్మ గొప్ప ధర్మ నిష్ఠ కలవాడిగా పేరు తప్పు చేస్తే తన సొంత కుమారుడని చూడకుండా అందరి ముందు శిక్ష వేసినట్టుగా పేరు ఉంది ,సుమారుగా ఇంతకు 40-50 సంవత్సరాలు పరిపాలించినట్టుగా చారిత్ర కారులు అంచనా వేశారు . ఈయన తర్వాత వచ్చిన వారు ఎవ్వరు ఎక్కువ కాలం పరిపాలించలేదు . 2వ గోవిందుడి కుమారుడైన మాధవ వర్మ 3 కాలం లో కొంత మేర కాపాడుకోగలిగారు .
ఒకవైపు కళింగులు ,చాళిక్యుల ఆక్రమణలతో వీరి రాజ్యం పూర్తిగా అంతం ఐనది .
వీరి కాలం లోనే ఉండవల్లి గుహల నిర్మాణం జరిగింది , ఘటికాలు (సంస్కృత పాఠశాలలు ) ఎక్కువగా నిర్మాణం జరిగాయి . సామంత రాజుల వెన్నుపోటు మరియు 2వ పులకేశి సహాయం తో కుబ్జా విష్ణువర్ధనుడు వీరి రాజ్యంపై దాడి చేశాడు . ఈ యుద్ధం లోనే 3వ మాధవ వర్మ ,మంచన భట్టారక ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది .
ఉండవల్లి గుహలు వీరి కాలం లోనే నిర్మాణం జరిగాయి .
శాతవాహనులు , ఇక్ష్వాకుల తర్వాత మన తెలుగు ప్రాంతాలని రాజకీయంగా, సాంస్కృతిక గొప్పగా పాలించిన వారిలో విష్ణుకుండినులు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారు . వీరు క్రీ శ 350-540 సంవత్సరాల మధ్య పరిపాలించినట్టుగా తెలుస్తుంది. ఈ రాజ్య స్థాపకుడు ఇంద్రవర్మ .
ఈ రాజ్యం కృష్ణా ,గోదావరి నదుల మధ్యలో వెలసింది . అంటే ఇప్పటి తెలంగాణ లోని పాలమూరు , నల్లగొండ ,హైద్రాబాదు , మెదక్ ,కర్నూల్ ,గోదావరి ,కృష్ణా , నెల్లూరు ఈ ప్రాంతాలు ఈ రాజ్యం లో ఉన్నాయనేది చారిత్రక వాదుల అభిప్రాయం .
ఇంద్రవర్మ మొదటగా ఇంద్రపాల నగరం అనే రాజధానిగా ఏర్పాటు చేసి పాలించాడు .ప్రస్తుతం ఈ ఇంద్రపాల నగరం(తుమ్మల గూడెం ) అనే చారిత్రక నగరం నల్లగొండ జిల్లాలో ఉంది .ఇటీవలే వీరి శాసనాలు హైదరాబాద్ నగరంలో త్రవ్వకాలలో భాగంగా బయటపడ్డాయి .
వీరి కాలంలో శైవం ,వైష్ణవం ,బౌద్ధం ,జైనం వంటి ప్రాంతాలు విలసిల్లాయి . ప్రధానంగా శ్రీశైలం ,ఉమామహేశ్వరం ,కొలనుపాక లాంటి స్థలాలు శైవానికి , శ్రీ పర్వతం , కొల్హాపూర్ వంటివి వైష్ణవానికి , కొలనుపాక , వేంగి,పఠాన్ చెరు,బెజవాడ ప్రాంతాలు జైనానికి ,
గుంటుపల్లి ,నాగార్జునసాగర్ (శ్రీ పర్వతం ) నల్లగొండ లోని చాలా ప్రాంతాలు బౌద్ధానికి ప్రసిధ్ధంగా ఉండేవని తెలుస్తుంది .
విష్ణుకుండినులు అన్ని మతాలని సమానంగా చూసారని తెలుస్తుంది .వీరు ప్రధానంగా శ్రీ పర్వత స్వామీ భక్తులు గా ఉన్నారు .అనేక యాగాలు , క్రతువులని అనుసరించి నట్టుగా తెలుస్తుంది .
ఈ రాజ్యాన్ని ఇంద్రవర్మ స్థాపించిన మాధవ వర్మ కాలం లోనే పెక్కు పేరు ని సంపాదించి గా తెలుస్తుంది .
2వ మాధవ వర్మ గొప్ప ధర్మ నిష్ఠ కలవాడిగా పేరు తప్పు చేస్తే తన సొంత కుమారుడని చూడకుండా అందరి ముందు శిక్ష వేసినట్టుగా పేరు ఉంది ,సుమారుగా ఇంతకు 40-50 సంవత్సరాలు పరిపాలించినట్టుగా చారిత్ర కారులు అంచనా వేశారు . ఈయన తర్వాత వచ్చిన వారు ఎవ్వరు ఎక్కువ కాలం పరిపాలించలేదు . 2వ గోవిందుడి కుమారుడైన మాధవ వర్మ 3 కాలం లో కొంత మేర కాపాడుకోగలిగారు .
ఒకవైపు కళింగులు ,చాళిక్యుల ఆక్రమణలతో వీరి రాజ్యం పూర్తిగా అంతం ఐనది .
వీరి కాలం లోనే ఉండవల్లి గుహల నిర్మాణం జరిగింది , ఘటికాలు (సంస్కృత పాఠశాలలు ) ఎక్కువగా నిర్మాణం జరిగాయి . సామంత రాజుల వెన్నుపోటు మరియు 2వ పులకేశి సహాయం తో కుబ్జా విష్ణువర్ధనుడు వీరి రాజ్యంపై దాడి చేశాడు . ఈ యుద్ధం లోనే 3వ మాధవ వర్మ ,మంచన భట్టారక ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది .
ఉండవల్లి గుహలు వీరి కాలం లోనే నిర్మాణం జరిగాయి .


Comments
Post a Comment