తెలుగు నేలపై చివరి బౌద్ధ భిక్షువు కథ LAST BUDDHIST MONK ON TELUGU LAND
తెలుగు నేలపై చివరి బౌద్ధ భిక్షువు కథ మనం ఈ విషయం తెలుసుకోవాలంటే ముందుగా వీర శైవ మత విజృంభణ కాలానికి మనం ప్రయాణించాలి . వీర శైవ మతాన్ని చెన్న బసవేశ్వరుడు ప్రారంభించాడు . ఈయన ఒక సత్బ్రహ్మన కుటుంబం లో జన్మించినప్పటికీ వైదిక క్రతువులను , వేదాలను వ్యతిరేకించి శివుడే దేవుడని , కాయమే కైలాసం అని తన భోధనలు చేసేవాడు. ఇతడి మతాన్ని అప్పటి బ్రాహ్మణులు ఒక పాషండ మతంగా విమర్శించేవారు . ఐనప్పటికిని ఈ మతం కన్నడ నేల పై విస్తరించింది ఎంతో మంది తెలుగు వారు కూడా ఆకర్షితులయ్యారు ఈ సమయంలో నే తెలుగు ప్రాంతం లో మల్లికార్జున పండితుడు ఉండేవాడు . ఈయన కూడా బ్రాహ్మణుడే బసవుని సిద్ధాంతాలకు మెచ్చి వీర శైవమతాన్ని ప్రచారం చేస్తాడు .వేదాలను , కుల వ్యవస్ధను మూఢనమ్మకాలను...