VISHNUKUNDINS | విష్ణుకుండినులు
విష్ణుకుండినులు
కీల్ హారన్ ప్రకారంగా వీరు గుంటూరు లోని వినుకొండ వాస్తవ్యులు . వీరు శ్రీ పర్వత స్వామీ భక్తులు . దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారు . వీరి రాజ్యస్థాపకుడు "మహా రాజ రాజేంద్ర వర్మ " క్రీ శ 350 లో స్థాపించాడు .
మాధవవర్మ - 370-398 సంవత్సరాల మధ్య పాలించాడు . ఈయన 11 అశ్వమేధ యాగాలు చేసాడు .
గోవిందా వర్మ - 398-435 ల మధ్య పాలించాడు . ఇతడు హిందూ మతాన్ని అనుసరించి బౌద్ధ మతాన్ని పోషించాడు . ఈయనే గోవిందా రాజుల విహారాని బౌద్ధ మతస్థులకు నిర్మించి ఇచ్చాడు . ఈ విషయాన్ని చైతన్యపురి (హైదరాబాద్ ) శాసనం ద్వారా తెలుసుకోవచ్చు .
3వ మాధవ వర్మ - ఈయనకు త్రికూట మలయాధిపతి అని బిరుదు .
ఇంద్రభట్టారక వర్మ - ఈయన ఎన్నో ఘటికాలను స్థాపించాడు . ఇందులో మూల ఘటికగా అనాసాపురం ఉండేది ఇవేకాక అమరావతి ,వేంగి,ఘటకేశ్వరం ముఖ్యమెయినవి (ఘటికాలు అనగా విద్యాలయాలు)
2వ విక్రమేంద్రవర్మ -రాజధానిని దెందులూరుకు మార్చడు .
4వ మాధవ వర్మ - ఈయన దుర్గ మల్లేశ్వర స్వామీ భక్తుడు కాగా రాజధానిని బెజవాడకు మార్చాడు . దుర్గ ఆలయాన్ని ఈయనే నిర్మిచాడు . జనాశ్రయా ఛందోవిచ్చితి అనే గ్రంథాన్ని రాశాడు . ఇది వ్యాకరణ గ్రంథం .
కుమారా మంచాన భట్టారక - ఇతనే చివరి రాజు తర్వాత పశ్చిమ చాకుక్య రాజైన 2వ పులకేశి ఆక్రమించుకున్నాడు .
ఇక వీరి కాలం లోనే హిందూ మతం తిరిగి పునర్వైభవం సంతరించుకోగా , బౌద్ధం నిరాదరణ చెందింది . వజ్రయాన బౌద్ధం కూడా ఈ కాలం లోనే ఉద్భవించింది . ఉండవల్లి గహలాయాలు వీరి కాలానికి కి సంబందించినవి .
జైన మతం విషయానికి వస్తే "కుమారులభట్టు" అనే మహర్షి జైన మహర్షుల వద్ద విద్య నేర్చుకొని జైన మహర్షులు ప్రతిపాదించిన "పూర్వమీమాంస" ను గట్టిగ వ్యతిరేకిస్తూ "తంత్రవార్షికా" అనే భాష్యాన్ని రాశారు . ఇతడు ఆ తర్వాత ఎంతో మంది జైనులను హిందువులుగా మార్చాడు . ఈ సమాయం లోనే జైనం లో "కాపాలికశాఖ " రావడం జరిగింది .
వీరి రాజా భాష సంస్కృతం . నల్గొండ ,గుంటూరు ప్రాంతాల్లో వీరి బంగారు , వెండి నాణాలు లభించాయి . 2వ మాధవవర్మ కాలం లోనే అమరావతి బౌద్ధస్తూపాన్ని "అమరేశ్వర దేవాలయంగా మార్చారు . విజయవాడ లోని అక్కన్న , మాదన్న గుహాలయాలు వీరి కాలం లోని వి గ చెప్పవచ్చు . వీరి రాజా లాంఛనం సింహం .




Comments
Post a Comment