jainism in telugu | జైనమతం
జైనమతం
జైన మతం అత్యంత ప్రాచీనమైనది . ఈ మాత ప్రభోధకులను "తీర్థంకరులని" పిలుస్తారు . మొత్తం 24 మంది తీర్థంకరులున్నారు . పురాణాల ప్రకారం మొదటి తీర్థంకరుడు -ఋషభనాథుడు ఇతని కుమారుడే బాహుబలి (గోమఠేశ్వరుడు). బాహుబలి సోదరుడే భరతుడు . కాగా చారిత్రకంగా మాత్రం పార్శ్వనాథుడు 23 వ వాడు .
వర్తమాన మహావీరుడు ఆఖరి (24) వ తీర్థంకరుడు మహావీరుడు జైన మతాన్ని సంస్కరించి దానికి చక్కని రూపాన్ని ఇవ్వడం జరిగింది . ఇతడు క్రీ పూ 540-468 మధ్య కాలానికి చెందిన వాడు . మహావీరుడు వైశాలి సమీపం లో ని కుంద అనే గ్రామం లో జన్మించాడు . తండ్రి జ్ఞానిక క్షత్రియ వంశానికి చెందిన "సిద్ధార్థుడు" తల్లి త్రిషలా . ఇతడు 12 సం .లు తపస్సు చేసి జినుడు అయ్యాడు . ఇతడు సన్యాసం తీసుకున్న తర్వాత అనేక మంది సిద్ధులను , యోగులను కలుసుకున్న అందులో గోశాలి పుత్ర మక్కాలి ఒకరు. ఆయన సిద్ధాంతాలు మహా వీరునికి రుచించక ఈయన వేరే మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది . జినుడు అనగ జ్ఞాన ప్రవాహాన్ని దాటినవాడని అర్థం . ఈయన తన 77 వ ఏటా బీహార్ లోని పావపురి లో నిర్యాణ ము చెందారు .
జైన మత ప్రభోధనలు
1.సత్యము
2.అహింస
3.అస్తేయం (ఇతరుల ఆస్తిని కాజేయడం చేయకుండుట)
4.అపరిగ్రహం (అవసరానికి మించి ఆస్తి లేకుండా ఉండటం )
ఇతడు ప్రత్యేకంగా చేర్చిన ది
5.బ్రహ్మచర్య .
మగధ పాలకులైన హార్యంక ,నంద వంశ రాజులు ఈ మతాన్ని ఆదరించారు .మన దేశం లో జైన మతం ఎక్కువగా రాజస్థాన్ , గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో ఉండగా ఓడిశాలోని ఉదయగిరి ప్రాంతంలో కూడా వీరి జనాభా ఉంది . తెలంగాణ లోని కొలనుపాక మన రాష్ట్రం లో ని చారిత్రక పుణ్య క్షేత్రాలు .
రాజస్థాన్ లోని మౌంట్ అబు లోని దిల్వారా వీరి పుణ్య క్షేత్రం.
వేదాలలో కూడా వీరి ప్రస్తావన ఉంది . జైనులను వేదాలలో శ్రమణులని పేర్కోవడం జరిగింది.
ఆ కాలం లో ఉన్న మూఢ నమ్మకాలను జైన మత గురువులు విమర్శించే వారు . జంతువద , ఖర్మకాండలకు వీరు వ్యతిరేకం .
ఆ తర్వాతి కాలాల్లో జైన మతం 2 శాఖలుగా విడిపోయింది అవి
1. శ్వేదంబర (వీరు తెల్లటి వస్త్రాలను ధరిస్తారు )
2..దిగంబర (వీరు దిగంబరంగా ఉంటారు ).
వీరి పవిత్ర గ్రంథాలు అంగాలు అని పిలుస్తారు . ఐతే ఈ మతం అధికంగా వైష్యులనే ఆకర్షించడం జరిగింది . చాలా మంది రాజులు , చక్రవర్తులు జైన మతాన్ని పుచ్చుకున్న సిద్ధాంతాలను పాటించలేక తిరిగి పూర్వ మతాలని తీసుకున్నారు . శాంతి , అహింస వీరి ప్రధాన జీవన సిద్ధాంతాలు .

Comments
Post a Comment