dammapada in telugu

                                                                ధమ్మపదం 


మన ప్రాచీనభారత  చరిత్రలో బౌద్ధమతానికి  విశిష్ట స్థానం ఉంది . మన దేశ సాంప్రదాయాలను ఖండాంతరాలకు చేర్చిన ఘనత  ఒక్క  బౌద్ధమతానికి  చేర్చబడుతుంది . బుద్ధుని బోధనలు సుమారు 2600 సంవత్సరాలు కృతనివేయినా ఇప్పటికి అమోదయోగ్యమైనవే . చలా మతగ్రంథాలు ఎన్న మార్పులకు గురైన బుద్ధుని బోధనలు మనకు ఇప్పటికి  ఎటువంటి  సవరణలు లేకుండానే  ప్రజలమదిలో  ఉండిపోయాయి . అని  చెప్పుకోవచ్చు  మన  దేశంలో బౌద్ధం ఉనికిలో లేకున్నా హిందూ  దాని భవనాలు విలీనం కావడం జరిగింది . ఉదాహరణకు  జీవహింస  చేయకుండుట , పచ్చి మాంసం తినుట ఇతర  మూఢనమ్మకాలను  బుద్ధుడు  వ్యతిరేకించడం జరిగింది . మన  నేల మీద  వెలుగు వెలిగిన మతం ఇప్పుడు మాత్రం అస్తిత్వం కోల్పోయింది . కానీ  అందించిన  మాత్రం   అలాగే ఉన్నాయి (అమరావతి, నాగార్జునకొండ ,నేలకొండపల్లి , బ్రాట్టిపోలు  , చైతన్యపురి , ఫణిపూర్ ) ఇంకా ఎన్నో ప్రదేశాల్లో  ప్రస్తుతం అవశేషాలు మాత్రమే లభిస్తున్నాయి .  

                         ఐతే బుద్ధుని బోధనలు మనకు   తెలుగు లో లభ్యం కావడం చాలా కష్టంగా ఉంది మరియు తప్పుడు (వక్రీకరించిన) ఉండటం  కారణం . 
* బుద్ధుడు తన ధ్యానం  బ్రహ్మ దర్శించనటం , రాక్షసులతో  తలపడటం , దేవునిగురించి  బోధనలు చేశాడు అనడం  ఇవన్నీ అసత్యాలే  దీనికి గల ప్రధానకారణం ఇతడు మధ్యేమార్గాన్ని  ఎంచుకున్నాడు . అనగా నాస్తిక వాదాన్నో లేదా ఆస్తిక వాదాన్నో  బలపరచలేదు . కేవలం వీటితో సంబంధం లేని మద్యేమార్గాన్ని ఎంచుకున్నాడు . 
* ఐతే బుద్ధుడు  కర్మ , పునర్జన్మ  లాంటి  వాటిమీద విశ్వాసం ఉంచడం జరిగింది.. 

మధ్యవాదం అనగా నాస్థిక , ఆస్తిక వాదాలకు వాదాలకు దూరంగా ఉంది నిబ్బాన  కి చేరుకోవడం. 

బుద్ధుల పవిత్ర గ్రంథం "త్రి పీటకాలు " అనగా మూడు  బుట్టలు అవి 
1. సుత్త పీఠిక - (అంగుతారా , రింగుత్తర, వజ్జి , దీఘా  నికాయలు )
2. వినయపీఠిక 
3. అభిదమ్మ పీఠిక 

ఇందులో  బుద్ధుని బోధనలతో పాటు బిక్కు ల నియమాలు , వివిధ అంశాలున్నాయి .ఇక కేవలం బుద్ధుని బోధనలు ధమ్మపదం లో చర్చబడ్డాయి . 
బుద్ధుని చరిత్రని  గతం లో నే ఇదే బ్లాకులో చేర్చబడింది ఇప్పుడు కేవలం బుద్ధుని బోధనలు మాత్రం చేర్చడం జరిగింది . 



1..తపో నియమాలతో  నిబ్బానాన్ని తథాగతుడు (బుద్ధుడు) అభిలషించడం లేదు , అంతమాత్రాన అతడు ప్రాపంచిక సుఖాలతో ఉన్నాడు అనుకోరాదు ఆనుకోరాదు  తథాగతుడు మధ్య మార్గాన్ని కనుగొన్నాడు. 

2. మాంసం తినకుండాఉండటం , బూడిద పోసుకోవడం , అగ్ని హోమాలు చేయడం అనేవి భ్రమలో చిక్కుకొని ఉన్న మానవుణ్ణి  శుద్ధి చేయలేవు. 

3. వేదాల పఠనం , బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మరియు శాశ్వత  ప్రాప్తి కోసం మనిషి చేసే ఇలాంటి కర్మలు ఏవి కూడా అతన్ని శుద్ధి చేయలేవు. 

4. కోపమ్ , త్రాగుబోతుతనం , మూర్ఖత్వం , మూఢవిశ్వాసం , అసూయా, ఆత్మస్తుతి , పరనింద , గర్వం, చేడు , ఆక్రోశం , అనేవి పరిశుద్ధ లక్షణాలు కావు. 

5. నూనె కి బదులు నీటితో దీపాన్ని వెలిగించే వాడు చీకటిని ప్రాలద్రోలలేడు ,క్రుళ్ళిన కలపతో జ్వాలాత్ జ్వాలను తీసుకురావాలని అనుకునే వాడు తన పనిని ఎప్పటికి నెరవేర్చుకోలేడు . 

6. కాలేశాపూరితమైన కృత్యాలు బాధాకరమే కాదు , వ్యర్థమూ  నిష్ప్రయోజనం కూడా . కామ జ్వాలను ఉపశమించాచేయలేడు  దౌర్బగ్యమైన జీవితాన్ని గడపటం వాల్ల అహంకారం నుంచి  ఎలా విముక్తుడవుతాడు?

7. అహంకారమైన  ఆత్మ ఉండే వరకు , ఐహిక సుఖాలు గాని , ఆముష్మిక భోగాలు గాని ఈ ఆత్మా కోరుకున్నంత వరకు శరీరం , ఇంద్రియాలు  అనుభవించే కాలేశాలన్ని వ్యర్థం . ఇలాంటి ఆత్మ ఎవరికీ నశిస్తుందో , అలాంటి వారు కామం నుంచి విముక్తులు అవుతారు . అతడు ఐహిక ఆముష్మిక భోగాలని కోరాడు . స్వాభావికరమైన కోరికలు  నిర్వర్తింపబడటం వల్ల  కలిగే తృప్తి అతనికి మాలిన్యాన్ని తీసుకురాలేదు . అతడు శరీర అవసరాలను  బట్టి ఆకలి దప్పులని తీర్చుకుంటాడు . 

8. కమలం చుట్టూ నీరు ఉన్న ఆకమలం దళాలు , నీటిలో తడిసిపోవు . కానీ ఇంద్రియ సుఖ  లోలత మానవుణ్ణి క్షయింపచేస్తుది . భోగసక్థి  పరుడు మోహవశ్శవర్తి అవుతున్నాడు . ఇంద్రియసుఖ యత్నం నీచం , తుచ్ఛం . జీవిత అవసరాలను తృప్తి పరచడం దోషం కాదు . శరీరాన్ని ఆరోగ్యాంగా ఉంచడం మన విధి , దీనిని మనం లెక్క చేయక పోతే జ్ఞాన దీపాన్ని చక్కపెట్టలేం , మన మనస్సును శుద్ధంగా , శక్తివంతంగాను ఉంచలేము.

9. ఓ బిక్కులారా ! సర్వం శాశ్వతంగా ఉంది , ఏది ఎప్పుడు లేదు అనే రెండు అవరోధాలు దూరంగా ఉన్న మార్గమిది .

10.బండిని లాగే వృషభాన్ని ఆ బండి చక్రం అనుసరిస్తుంది , అలాగే పాపా బుద్ధితో మాట్లాడిన , ప్రవర్తించిన అట్టి వాణ్ని బాధ అనుసరిస్తుంది.

11. మనం ఏది విత్తుతామో  , ఆ పంటనే పొందుతాము . కాబట్టి మనం పాప కర్మలను ఆచరించకుండా ఉండడానికి మన భావాలను మనమే పరిరక్షించుకోవాలి .

12.పాపికి పాపము తేనె వాలే తియ్యగా అనిపిస్తుంది . తనకు మూర్కత్వం ఉందని తెలుసుకోగలిగిన మూర్ఖుడు అంత వరకు ఐనా అవివేకియే . కానీ తాను జ్ఞానినని భావించుకొనె  మూర్ఖుడు నిజంగా పరమ మూర్ఖుడు .

13. కెలేశాలను పూర్తిగా నశింపచేయడానికి గల మార్గం ఏమిటి ? అన్న ప్రశ్నంకు  బుద్ధుడు అష్టాంగ మార్గమే  ముఖ్యానమే తెలిపారు .

14. శుభం అంటే ఏమిటి ? అన్న ప్రశ్నకు భగవానుడు ఇలా చెప్పాడు !
          దొంగతనం చేయకుండా ఉండటం ,ఇంద్రియ సుఖాల జోలికి పోకుండా ఉండటం , అబద్దాలాడకుండా ఉండటం ,నిర్దయను అణగద్రొక్కడం , వ్యర్థ ప్రలాపాలు చేయకుండటం , అసూయను పూర్తిగా జయించడం , ద్వేషాన్ని పరిత్యజించడం , సత్యాన్ని నుసరించడం ..... ఇవన్నీ శుభ కర్మలు . శుభ కర్మలు ద్వేషం -భ్రమల నుండి విముక్తి పొందినపుడే శుభ కర్మలు బయలుదేరుతాయి .

15.  బుద్ధిమాంద్యం  అజ్ఞానంతో ఉన్నవాడు మౌనం పాటించిన ముని కాలేడు .  వివేకి ఐన జ్ఞానీ త్రాసు తూచేవాడిలా పాపాన్ని తిరస్కరించి , శుభాన్నే  స్వీకరిస్తాడు  ఇతడే ఋషి .


16. పుణ్య పాపాలను రెండింటిని వదిలి , పవిత్రుడై, జ్ఞానం తో , ఈ లోకంలో ఎవరు నివసిస్తారో ,  భిక్షువు.

17. ఇతరులను అడిగి  తెచ్చుకున్నంత మాత్రాన భిక్షవు కాలేడు . పాపవాసనలు  గల కర్మలను
అనుసరించే వాడెవ్వడు భిక్షువు కాలేడు .

18.  ఓ బిక్షువులారా ! సమ్యక్ సంకల్పం అనే మకుటం తో ,మీ తలాలను కప్పుకొని , స్థిర సంకల్పంతో పఞ్చాతృష్ణల పై పోరు సలపండి .

19.  మానవ హృదయం లో చీకట్లు కమ్మేటట్లు చేసేది కామం , స్త్రీ  సౌందర్యం చిత్తాన్ని  కలత పెట్టినప్పుడు చిత్తం నిశ్చేష్టతను పొందుతుంది .

20. సర్వత్రా యమ ,నియమాలు శుభకరం . మనోవాక్కాయలను అదుపులో ఉంచడం మంచిది . అన్నిటిని తన అదుపులో ఉంచుకున్న భిక్షువు సమస్త దుః ఖ్ఖ ల నుండి విముక్తుడువవుతావు .

21.  ఏకాంతమును ప్రవేశించి , శాంత చిత్తుడై , చక్కగా ధర్మాన్ని దర్శించే వాడు లోకోత్తరమగు ఆనందాన్ని పొందుతాడు .

22. ఉదార చిత్తం తో నివసిస్తూ , ఆచార కుశలుడు అయినవాడు ఆనందం తో నిండి   దుక్ఖాన్ని అంతం చేయగలుగుతాడు.

23. దర్భను జాగ్రత్తగా గ్రహించకపోతే పట్టుకున్న చేతినే కోసేటట్టు జాగ్రత్తగా ఆచరించని భిక్షువు జీవితం నరకానికి లాగేస్తుంది.

24.  ఎవరి మనస్సు కామద్వేషాలతో కలుషితం కాలేదో, ఎవరు శుభా శుభములు రెండింటిని వదిలివేస్తారో అట్టి బుద్ధుడైన జాగురూకుడికి భయం లేదు .

25. అజ్ఞాన మార్గాన్ని చిత్తం , పాపి ఐన శత్రువు కంటే అత్యధికమైన కాలేషాన్ని కలిగిస్తుంది.

26. వశం చేసుకోవడానికి కష్టమైనది , అతి సూక్ష్మం , వేగంగా పోయేది , ఇష్టానుసారం పరుగెత్తే చిత్తాన్ని నిగ్రహించడం మంచిది . నిగ్రహింపబడిన చిత్తం సౌఖ్య0  అవుతుంది.

27. అస్థిర చిత్తుడు , సద్ధర్మమ్ తెలియని వాడు , ప్రశాంత చిత్తం లేక ముందుకి వెన్నక్కి   ఊగిసలాడే వ్యక్తి ప్రజ్ఞ పరిపూర్ణం కాదు.

28.  చిత్తం దూఱంగ  ఏకాకిగా తిరుగుతూ , అశరీరియై  , గుహలో ఉంది . దీన్ని లోబరుచుకున్న వ్యక్తి మారుని బంధాల నుంచి విముక్తి పొందుతాడు .

29.  తల్లి తండ్రులు గాని , ఇతర బంధువులు గాని  చేయలేని దానిని  సమ్యక్ లక్షితమైన  చిత్తం  నెరవేర్చగలదు . తద్వారా  అట్టి చిత్తం గలవాడు ఔదార్యం   పొందగలడు.

30. ఒక శత్రువుకు ఇంకొకవైరి , ఒక ద్వేషికి   ద్వేషి ఈత క్లేశాన్ని  తీసుకురాగలరో అంతకన్నా ఎక్కువ క్లేశాన్ని దుష్టపథం  అవలంబించిన చిత్తం తేగలదు.

31. అభ్యాస శూన్యతే సమాధి లో గల అశౌచం . అశుచిత్వం శరీరానికి మాలిన్యం . కలత చెందడం మనసుకు గల అశౌచం .

32. తృష్ణ అనేది లేకుండా నిర్మలమెయినా చిత్తము ఎవరికీ గలదో అట్టి ప్రబుద్ధునకు కొంచము  కూడా భయం లేదు.

33. పాపకృత్యాల జోలికి పోకుండా ఉండడం , శుభ కర్మలను ఆచరించడం , చిత్త  శుద్ధి  అనేది  ముఖ్యం - అని బుద్ధుని సిద్ధాంతం

34. నేను  అనేది మరణాంతరం కూడా సజీవంగా ఉంటుందని కొందరు , శరీర పతనంతో అది కూడా నాశనం అవుతుందని  మరి కొందరు అంటున్నారు . ఈ రెండు వాదాలు అసత్యాలే . ఈ అనృతం అతి విషాద భరితం .

35. 'నేను ' అని వ్యవహరింపబడుతున్నది వినష్టమైన ప్రత్యయం అని వారంటే , కోరి యత్నించే కర్మఫలాలు కూడా నశించాలి. అప్పుడు భవిష్య జీవితం కూడా ఉండదు . ఇది సత్యమైతే పాపభరితమైన స్వార్థపరత నుండి కలిగే విముక్తి శుభ రహితం , ఫల రహితం , ఫలరహితం అవుతుంది.

36.  విషయాభిరాగం , లోభత్వము , ఇంద్రియసుఖ లోలత్వం మొదలెయినవి  పూర్వజన్మలో సముపార్జించినవి నేడు మనం అనుభవించే కర్మఫలాలు . ప్రపంచంలోని అహంకారం , ఆడంబరాలకు , దుఖ్హాలకు ఇవి హేతువులు . 









Comments

Popular posts from this blog

kanishka in telugu | కనిష్కుడు

buddhism in telugu | భౌద్ధమతం