సోమదేవుని యశస్థిలకము 


                  సోమదేవసూరి రచించిన యశస్థిలకం  9-10 వ శతాబ్దపు మత , సామాజిక , ఆర్ధిక , పరిపాలన పరమైన, ప్రజల ఆహార అలవాట్ల మీద కూడా వివరంగా కూలంకషంగా చర్చించబడింది . 

     ఐతే ఈ గ్రంథం గురించి కొన్ని విషయాలను ఇక్కడ ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది . 

                    సోమదేవసూరి ప్రసిద్ధ జైన మతాచార్యులు ఆనాటి కాలంలో ఈయన పరమార రాజ్య , వేములవాడ చాళుక్యుల ఆస్థానంలో పనిచేసిన వారు ఈయన . 2 వ అరి కేసరి తర్వాత రాజైన వాగ రాజు ఆస్థానంలో ఉన్నాడు మరియు 2 వ బద్దెగుడి విద్యా గురువు సోమదేవుడు.

అనగా ఈయన వాగరాజు, 2వ బద్దెగుడు , 3వ అరికేసరి  కాలం వాడు .

ఇతని బిరుదులు:

తార్కిక చక్రవర్తి , కవికుల రాజు ,శాద్వదాచాల సింహ , వాక్కల్లోల పయోనిధి

ఇతని  రచనలు:  

యుక్తచింతామని, సనావతి ప్రకరణం,నీతికావ్యామృత మరియు యశస్థిలక  చంపూ కావ్యం 

3వ బద్దెగుని  పర్బనీ శాసనం ప్రకారం  సోమదేవునకు వాణికటువుల  గ్రామాన్ని దానం         చేసారు. 


> సోమదేవుడికి పరమార రాజ్యం తో పాటుగా వేములవాడ చాళుక్యులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. 

>పశ్చిమోత్తర తెలంగాణ వేములవాడ చాళుక్యుల ఆధీనంలో ఉండేది . వీరు రాష్ట్రకూటుల కు సామంతులుగా ఉండేవారు . 

>2 వ అరికేసరి సమయంలో వేములవాడలో శుభదామ జినాలయాన్ని నిర్మించారు .

>ప్రస్తుత గంగాధర ప్రాంతంలో గవుండ సంఘం వారు ఒక జినాలయాన్ని , బసది మరియు గోశాలని నిర్వహించేవారు ఇక్కడ కూడా సోమదేవసూరి కొంత కాలం గడిపారని ప్రతీతి. 

యశస్థిలక చంపూ కావ్యం లో ప్రధానంగా అప్పటి జైన మతం, ఆహారపు అలవాట్లు,శైవ మతం, కాలముఖులు - నకుశీల సిద్ధాంత మాల అనే గ్రంథం ఆధారంగా వారి మతాన్ని ఆచరించేవారు.

>తాంత్రిక పూజా విధానాన్ని "వామ మార్గ " గా పేర్కొన్నారు . 

                యశోధర పాత్ర(పాంచాల) ద్వారా ఆనాటి జంతు బలులను గురించి వ్యతిరేకంగా మరియు వివాదాస్పదంగా కూడా ఈ రచన ఉన్నట్టు చెబుతారు చారిత్రకారులు .

> ఇక అప్పటి జైనుల ఆహార అలవాట్లను గురించి, ఉపవాస దీక్ష ల గురించి , జైన బసదులు వారి యొక్క ముఖ్య విద్యాపీఠాలు, అందులో అభ్యసించే మత గ్రంథాలు గురుకుల విధానానికి దగ్గరి పోలికలతో ఉంటుంది. 

>ఆకాలం లో మత సంబంధమైన దానాల్లో వెండి మరియు బండారు లోహాలను ఎక్కువగా దానం చేసేడి  వారు  .

>ఏదైనా గ్రహణాలు  ఉన్నప్పుడు చెడు గా భావించే వారు గ్రహణం ముగిసిన తర్వాత స్నానాది జప తపాలు చేసేవారు , జైనా రామాల్లో సంప్రోక్షణ చేసేవారని ఈ కావ్యం లో చెప్పబడింది .

 >శ్రీ పర్వతం లో అనేక జైనారామాలు ఉండేవని వీటిని తానూ దర్శించానని సోమదేవుడు చెప్పుకున్నాడు (13 వ శతాబ్దపు కన్నడ జైన మతాచార్యుడు శ్రీ పర్వత ప్రాంతం లోని జైనారామాల దుస్థితిని విమర్శనాత్మకంగా నయసేనుడు ధర్మామృతం అనే కన్నడ గ్రంథం లో తెలిపాడు . )    

>జైనుల ప్రత్యేక దినాలు వారు ఆ రోజు ఆచరించే పనుల గురించి ఈ గ్రంథంలో పేర్కొనబడి ఉంది .  

          అప్పటి హిందూ మతంలోని వామాచారాలు తాంత్రిక పద్ధతులు , తమ శరీరంలోని భాగాలను కత్తిరించుకోవడం , కాళ్లు చేతులను నరుక్కొని దేవుడికి అర్పించడం లాంటివి శైవం లోని ప్రధాన ఆచారాలుగా చెప్పబడింది . కన్నడ దేశంలో వీర శైవం విస్తరించేవరకు జైనం పెద్ద వర్గంగా నిలబడింది .   

                       


                         

Comments

Popular posts from this blog

kanishka in telugu | కనిష్కుడు

buddhism in telugu | భౌద్ధమతం